ట్రంప్ సుంకాల ప్రభావం ఇండియాకి కలిసొస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ విక్రేత అయిన ఫాక్స్కాన్ ఉత్తరప్రదేశ్లో తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అలాగే ఈ ఫ్యాక్టరీని గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్వే సమీపంలో 300 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఈ సమాచారాన్ని అందించింది. ఫాక్స్కాన్ ఉత్తరప్రదేశ్లో సొంతంగా యూనిట్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ ప్లాంట్ బెంగళూరులో నిర్మిస్తున్న ఫాక్స్కాన్ ప్లాంట్ కంటే కొంచెం పెద్దగా ఉండవచ్చని సమాచారం.
ప్రాథమిక దశలో చర్చలు
భూమిని కొనుగోలు చేసిన ఫాక్స్కాన్ : ఫాక్స్కాన్ ఫ్యాక్టరీని కోసం భూమిని HCL-ఫాక్స్కాన్ OSAT (అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ఆంట్ టెస్ట్) సౌకర్యం కోసం 50 ఎకరాలను సేకరించిన ప్రాంతంలో ఉంది. OSAT అంటే ఫెసిలిటీ ఫర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ సెమీకండక్టర్ చిప్స్. ఈ ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం లభించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, భారత ప్రభుత్వం గత సంవత్సరం ఫాక్స్కాన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టు కోసం 300 ఎకరాల భూమిని ప్రతిపాదించింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
ఈ భూమి యమునా ఎక్స్ప్రెస్వే పక్కన గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలుపుతుంది. ఈ భూమిని యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (YEIDA) చూసుకుంటుంది. యమునా ఎక్స్ప్రెస్వే జెవార్లో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాన్ని ఇంకా నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేను కూడా కలుపుతుంది.

నోయిడాలో మంచి మౌలిక సదుపాయాలు
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా మాట్లాడుతూ టారిఫ్లు అలాగే ప్రపంచ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ఫాక్స్కాన్ భారతదేశంలో ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటున్నట్లు అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో EMS (ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు) అవకాశాలను అందిస్తుండొచ్చు. EMS అంటే ఇతర కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడం. ఇందుకు ప్రస్తుతం భారతదేశం బెస్ట్ అప్షన్ గా పరిగణించబడుతుంది. నోయిడా చెన్నైలాగా పెద్ద తయారీ కేంద్రంగా మారిందని షా అన్నారు. మంచి మౌలిక సదుపాయాలు, EMS ప్రొవైడర్లను సరఫరా చేసే చాల మంది సప్లయర్స్ ఉన్నారు. వివిధ ప్రదేశాలలో ప్లాంట్స్ ఉండటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని కూడా షా అన్నారు. ఇది కస్టమర్లకు దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది ఇంకా స్మార్ట్ డివైజెస్ నుండి ఆటోల వరకు ఉత్పత్తులను తయారు చేయడాన్ని సులభతరం చేస్తుంది.
బలంగా వున్నా భారతదేశ మార్కెట్
ఫాక్స్కాన్కు ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ఇంకా తెలంగాణలో ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కార్యకలాపాలను మూసివేసిందని సమాచారం. సైబర్ మీడియా రీసెర్చ్లోని పరిశ్రమ పరిశోధనా బృందం ఉపాధ్యక్షుడు ప్రభు రామ్ మాట్లాడుతూ, భారతదేశ మార్కెట్ బలంగా ఉందని ఇంకా ఎగుమతులకు కేంద్రంగా మారుతోందని అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సప్లయ్ చైన్ గా మారుతోంది, ఇది భారతదేశానికి ప్రయోజనం చేకూరుస్తోంది. భారతదేశంలో ఫాక్స్కాన్ పెట్టుబడి పెరగడం వల్ల ఈ కంపెనీ భారతదేశంలో తయారీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. కంపెనీ విస్తరణ : ఆపిల్ అంటే ఫాక్స్కాన్ ఈ సప్లయ్ స్మార్ట్ఫోన్లకే పరిమితం కావాలని కోరుకోవడం లేదు . గత సంవత్సరం భారతదేశ పర్యటన సందర్భంగా, ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ అండ్ డిజిటల్ హెల్త్ వంటి రంగాలలో కూడా ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
Read Also: Saurabh Murder Case: ముస్కాన్కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలి:రాహుల్ రాజ్పుత్