हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Vijaya Mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా

Vanipushpa
Vijaya Mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా

సుమారు రూ. 9,000 కోట్లకు పైగా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijaya mallya) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమానీ(Raj Shamanii)తో నాలుగు గంటల పాటు సాగిన ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం, తనను ‘దొంగ’ అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు.

Vijaya malya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా
Vijaya mallya: న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా: మాల్యా

అసలు ‘దొంగతనం’ ఎక్కడ జరిగింది?” :మాల్యా
“మార్చి (2016) తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నేను పారిపోలేదు, ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే భారత్ నుంచి బయటకు వెళ్లాను. సరే, నేను సరైనవని భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు, కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ ‘దొంగ’ అనే మాట ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ‘దొంగతనం’ ఎక్కడ జరిగింది?” అని మాల్యా పాడ్‌కాస్ట్ లో ప్రశ్నించారు. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యా విదేశాల్లో ఉండటం వల్ల తన న్యాయపరమైన చిక్కులు మరింత తీవ్రమయ్యాయా అనే అంశంపైనా వ్యాఖ్యానించారు. “భారత్ లో నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి లభిస్తుందన్న హామీ ఉంటే మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నాకు ఆ హామీ లేదు” అని ఆయన అన్నారు.
భారతీయ జైళ్లలోని పరిస్థితులు సరిగ్గా లేవు
న్యాయబద్ధమైన విచారణకు హామీ ఇస్తే భారత్ కు తిరిగి వస్తారా? అని ప్రశ్నించగా “నాకు అలాంటి హామీ లభిస్తే కచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను” అని మాల్యా బదులిచ్చారు. అప్పగింత కేసులో యూకే హైకోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకిస్తూ భారతీయ జైళ్లలోని పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని తేలిందని చెప్పారు. “అందువల్ల వారిని వెనక్కి పంపలేరు” అని పేర్కొంటూ తనకు కూడా అలాంటి ఆందోళనలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొన్నారు. .
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంక్షోభం
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం గురించి మాల్యా మాట్లాడుతూ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇందుకు ఒక ప్రధాన కారణమని తెలిపారు. “మీరు లెమాన్ బ్రదర్స్ గురించి విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి విన్నారు కదా? అది భారత్ పై ప్రభావం చూపలేదా? కచ్చితంగా చూపింది” అని షమానీతో అన్నారు. “ప్రతి రంగం దెబ్బతింది.
“నేను శ్రీ ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి నాకు ఒక సమస్య ఉందని చెప్పాను. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు తగ్గించుకోవాలి, విమానాల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగులను తొలగించాలి, ఎందుకంటే ఈ కుంగిపోయిన ఆర్థిక పరిస్థితుల్లో కార్యకలాపాలు కొనసాగించలేను” అని చెప్పారు. అయితే, కార్యకలాపాలు తగ్గించవద్దని, బ్యాంకులు మద్దతు ఇస్తాయని ఆయన తనకు సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మాల్యా
మాల్యాకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 9న భారతీయ స్టేట్ బ్యాంక్ సహా భారతీయ రుణదాతల కన్సార్టియంకు చెల్లించాల్సిన రూ. 11,101 కోట్ల రుణానికి సంబంధించి లండన్ హైకోర్టు జారీ చేసిన దివాలా ఉత్తర్వులపై చేసిన అప్పీల్‌ను ఆయన కోల్పోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ. 6,200 కోట్లకు బదులుగా బ్యాంకులు ఇప్పటికే రూ. 14,000 కోట్లు రాబట్టుకున్నాయని తన న్యాయవాది ద్వారా వాదించారు. రాబట్టుకున్న మొత్తానికి సంబంధించిన వివరణాత్మక లెక్కలను అందించాలని రుణదాతలను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆర్. దేవదాస్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత బ్యాంకులకు, రుణ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Read Also: New Zealand: వేశ్యల‌తో పీఎంవో ఉద్యోగి ఫోన్ రికార్డింగ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

📢 For Advertisement Booking: 98481 12870