బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం, రైతు సంక్షేమం వంటి రంగాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. బడ్జెట్‌లో ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు ప్రభుత్వ మేనిఫెస్టోలో కీలకంగా ఉండగా, ఈ బడ్జెట్‌లో వాటి అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.’అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తిస్తుంది.

Advertisements

బడ్జెట్ హైలైట్స్

మొత్తం బడ్జెట్ – రూ. 3,22,000 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు.

ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు

వ్యవసాయం – రూ. 48,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు – రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం – రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్య – రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్య – రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – రూ. 1,228 కోట్లు.

1894773 payyavulakeshav

సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు

బీసీ సంక్షేమం – రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ. 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ. 5,434 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం – రూ. 4,332 కోట్లు.

ముఖ్యమైన రంగాలు

పంచాయతీ రాజ్ శాఖ – రూ. 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖ – రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖ – రూ. 18,019 కోట్లు
ఆర్ అండ్ బీ (రోడ్లు & భవనాలు) – రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖ – రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి & ప్రచారం – రూ. 10 కోట్లు.

బడ్జెట్ ప్రత్యేకతలు

సూపర్ సిక్స్ పథకాల అమలుకు అధిక నిధులు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, ఆరోగ్య భీమా వంటి పథకాలకే అధిక కేటాయింపులు,
రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యం.
గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

Related Posts
నేటి నుంచి మేరీ మాత ఉత్సవాలు
gunadala mary matha

విజయవాడ గుణదల కొండపై ప్రారంభమయ్యే మేరీ మాత ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. 1923లో ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదల కొండపై మేరీ మాత విగ్రహాన్ని Read more

అక్రమంగా తరలిస్తున్న గోమాసం పట్టుబడిన కంటైనర్
img1

అక్రమంగా తరలిస్తున్న గోమాసం.. పట్టుబడిన కంటైనర్. పాతిపెట్టిన పోలీసులు… ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు.!( నక్కపల్లి ,ప్రభాతవార్త) గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా గోమాసాన్ని తరలిస్తుండగా Read more

తిరుపతిలో ప్రారంభమైన టెంపుల్‌ ఎక్స్‌పో
Temple Expo started in Tirupati

ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు తిరుపతి : తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు Read more

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్
Pawan Kalyan నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది పవన్ కల్యాణ్

Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్ జయకేతనం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యే… Read more

Advertisements
×