బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం, రైతు సంక్షేమం వంటి రంగాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. బడ్జెట్‌లో ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు ప్రభుత్వ మేనిఫెస్టోలో కీలకంగా ఉండగా, ఈ బడ్జెట్‌లో వాటి అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.’అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తిస్తుంది.

Advertisements

బడ్జెట్ హైలైట్స్

మొత్తం బడ్జెట్ – రూ. 3,22,000 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు.

ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు

వ్యవసాయం – రూ. 48,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు – రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం – రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్య – రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్య – రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – రూ. 1,228 కోట్లు.

1894773 payyavulakeshav

సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు

బీసీ సంక్షేమం – రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ. 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ. 5,434 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం – రూ. 4,332 కోట్లు.

ముఖ్యమైన రంగాలు

పంచాయతీ రాజ్ శాఖ – రూ. 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖ – రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖ – రూ. 18,019 కోట్లు
ఆర్ అండ్ బీ (రోడ్లు & భవనాలు) – రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖ – రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి & ప్రచారం – రూ. 10 కోట్లు.

బడ్జెట్ ప్రత్యేకతలు

సూపర్ సిక్స్ పథకాల అమలుకు అధిక నిధులు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, ఆరోగ్య భీమా వంటి పథకాలకే అధిక కేటాయింపులు,
రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యం.
గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

Related Posts
ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
Private Bus Exploitation Du

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్బంగా ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు ఉత్సాహంగా సిద్ధంగా కాగా.. పండుగ రద్దీ కారణంగా ప్రయాణాలకు సంబంధించిన కష్టాలు అధికమవుతున్నాయి. హైదరాబాద్ Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు
Diwakar travels bus caught fire in anantapur

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో Read more

జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!
జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి Read more

×