తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు కురిశాయి. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. కామారెడ్డి మరియు ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీగా వడగండ్ల వాన కురవడంతో రోడ్లన్నీ తెల్లటి మంచు పొరను తలపించేలా మారాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు తక్షణ ఉపశమనం లభించింది.
Read Also : Moinabad Drug Party: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్ట మహేష్.. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు!
అయితే, ఈ అకాల వర్షాలు సామాన్య ప్రజలకు ఆహ్లాదాన్ని పంచినప్పటికీ, రైతాంగాన్ని మాత్రం తీరని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు కోత దశకు చేరుకున్న తరుణంలో, వడగండ్ల వాన పడటం వల్ల చేతికి వచ్చిన పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, మామిడి, మరియు ఇతర తోట పంటలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాల ధాటికి ఆరుగాలం శ్రమించిన పంట నేలపాలవుతుందేమోనని అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :