हिन्दी | Epaper

Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

Uday Kumar
Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

గత పదిరోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులను ఇచ్చింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతుంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో(Telangana) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.దీంతో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో పలు రాష్ట్రాలకు వాన ముప్పు

తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, వరంగల్, నిజమాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్(Adilabad), కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పలు రాష్ట్రాలకు వాన ముప్పు

రెడ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్లో మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి,కాకినాడ, తూర్పు గోదావరి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలి
పారు. అధికారులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also : Musi River : మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870