हिन्दी | Epaper

Operation Sindoor: ‘భారత్​కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్

Vanipushpa
Operation Sindoor: ‘భారత్​కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో ఉగ్రదాడిని యూకే ఎంపీ ప్రీతి పటేల్ ఖండించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారత్​కు అందించే సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాల ముప్పును గుర్తించాలని కోరారు. ఈ మేరకు యూకే హౌస్ ఆఫ్ కామన్స్​లో ఆమె మాట్లాడారు.
శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలి
“ఈరోజు హౌస్ ఆఫ్ కామన్స్​లో పహల్గాంలో జరిగిన దారుణం వల్ల ప్రభావితమైన వారికి నా సంతాపాన్ని పునరుద్ఘాటించాను. ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారికి అంకా అండగా నిలబడాలి. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత్​తో బ్రిటన్ ప్రభుత్వం పనిచేయాలి” అని ప్రీతి పటేల్ ఎక్స్​లో పిలుపునిచ్చారు.

Operation Sindoor: 'భారత్​కు అండగా నిలబడాలి'- యూకే ఎంపీ ప్రీతి పటేల్
Operation Sindoor: ‘భారత్​కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్

పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం
“ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యటకులను క్రూరంగా, దారుణంగా చంపారు. చాలా మంది బాధితుల తలలపై తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చంపేశారు. పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారందరితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి. పహల్గాం ఇప్పుడు ఉగ్రవాద చర్యల వల్ల ప్రభావితమైన ముంబయి, దిల్లీ వంటి భారతీయ నగరాల జాబితాలో చేరింది” అని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు.
ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అది
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని చెబుతూనే, పాక్​ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎదుర్కొంటున్న ముప్పును UK గుర్తించాలని ప్రీతి చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అదని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత బ్రిటిష్ భారత్​కు ఏదైనా భద్రతా సహాయం అందించిందా అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు.

Read Also: All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870