అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

Assembly: అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో 41వేల కోట్లు అప్పులు చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ అన్నారు.
డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు
ఒక జర్నలిస్టు ఎవరో కేటీఆర్ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగురవేసి అక్కడి సమాచారం తనకు అందించాడని..దాన్ని మీడియా ద్వారా బయటపెట్టినందుకు ఎంపీగా ఉన్న తనను డిటెన్షన్ సెల్‌లో నిర్భంధించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. సాధారణంగా అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరు అంతా ఇంతా కాదని చాలా అన్యాయంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లికి లగ్నపత్రిక రాసుకుంటుండుగా తనను బెయిల్‌ పై విడుదల చేయాలని కోరగా… బెయిల్ రాకుండా నాడు అడ్డుకున్నారని గుర్తుచేశారు. చివరకు బెయిల్ పై విడుదలై తన బిడ్డ పెళ్లికి హాజరై తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లినట్లు రేవంత్ రెడ్డి సభలో చెప్పారు.

Advertisements
Related Posts
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో..?
telangana cs santhakumari

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతి కుమారి పదవీ కాలం ఏప్రిల్ 7న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవరు Read more

KCR : రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి – KCR
RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్పు కోసం ప్రజలు ఆశతో Read more

సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు
families of the battalion constables who besieged the secretariat

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ Read more

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి..క్యాబినెట్ విస్తరణ పై చర్చ జరుగనుందా..?
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×