ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ

ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టారు. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు , సినీ నటుడు విజయ్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన సురక్ష పార్టీ ( JSP ) అధినేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమైయ్యారు. చెన్నై శివారులోని తన నివాసంలో భేటీ అయ్యారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ

ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఇద్దరి భేటీ

ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేతో అనధికార చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ఇద్దరి భేటీ తమిళనాట ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ నివాసమైన నీలంకరైలో జరిగిన ఈ సమావేశంలో టీవీకె పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో తమిళనాడు రాజకీయ పరిస్థితులు, జాతీయ పరిణామాలు, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

ఎటువంటి ఒప్పందం జరగలేదు

అయితే టీవీకే తరుపున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించేందుకు ఎటువంటి ఒప్పందం జరగలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే విజయ్, తన పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రత్యేకంగా జాన్ ఆరోకియాసామిని నియమించుకున్నారు. రాజకీయ వ్యూహకర్త ఆధర్ అర్జునాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిమించి ప్రచార బాధ్యతలనున ఆయను అప్పగించారు. 2023 అక్టోబర్‌లో నిర్వహించిన రాష్ట్రమహాసభకు ముందే ప్రశాంత్ కిషోర్‌ను టీవీకే సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు సమావేశమైయ్యారు. గతంలో డీఎంకే తరుపును ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

ఎన్నికల వ్యూహంకు సిద్ధం

ఇటీవల టీవీకే తమ పార్టీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమేనని , కానీ విజయ్ నాయకత్వాన్ని ఆమోదించిన పార్టీ మాత్రమే తమతో కలిసి రావచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌తో విజయ్‌ భేటీ కావడం.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పొత్తులు, ఎన్నికల వ్యూహం, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Posts
కంఫర్ట్ జోన్ వద్దు: యువతకు ప్రధాని మోదీ హెచ్చరిక
యువశక్తి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తుంది Copy

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డయలాగ్లో ప్రసంగించిన ప్రధాని మోడీ, దేశ భవిష్యత్తును రూపొందించడంలో Read more

మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ Read more

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష
RG Kar issue. Junior doctors hunger strike enters 10th day

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో Read more

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం
woman constable

యూపీ లోని కాన్పూర్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగింది. అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న 34 సంవత్సరాల మహిళా కానిస్టేబుల్ కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్ బయలుదేరారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *