
మానవత్వం(Humanity) రోజురోజు మంటకలసిపోతున్నది. పబ్లిక్ గా ఒక వ్యక్తిని కొందరు పోకిరీలు పొట్టుపొట్టుగా కొడుతుంటే ఎందుకు కొడుతున్నావంటూ ఒక్కరూ అడ్డుకున్న పాపానికి పోలేదు. అంతగా దెబ్బలు కొట్టించుకున్న వ్యక్తి చేసిన నేరం ఏంటి? జస్ట్ దారి ఇవ్వమని అడిగినందుకు. అసలు ఏం జరిగిందో మీరే చదవండి.
Telugu News: Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు
అంబులెన్స్ కు దారి ఇవ్వమని అడిగిన డ్రైవర్
హైదరాబాద్ నుంచి కోఠి(Koti) ఇఎన్టి ఆసుపత్రి నుండి బాలింతను ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో, బీఎన్ రెడ్డి నగర్ వద్ద కొందరు పోకిరీలు అంబులెన్స్కు అడ్డు వచ్చారు. దీంతో అంబులెన్స్కు దారి ఇవ్వమని డ్రైవర్ యువకులను అడిగాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు అంబులెన్స్ ను ఆపి, డ్రైవర్, సెక్యూరిటీ గార్డపై దాడి చేశారు. డ్రైవర్పై పిడిగుద్దు గుద్దుతూ, పైశాచిక ఆనందాన్ని పొందారు. అంతటితో వదలిపెట్టకుండా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ, చివరికి డ్రైవర్ చేత కాళ్లు మొక్కించుకున్నారు. ఇంత తంతు జరుగుతున్నా దాడి చేస్తున్న యువకులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం విచారకం. అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నా అరగంట సేపు వాహనాన్ని ఆపి, డ్రైవర్, సెక్యూరిటీ గార్డపై దాడికి పాల్పడ్డారు. చివరికి తమదే తప్పని అంటూ యువకుల కాళ్లను మొక్కి డ్రైవర్ తన తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అంబులెన్స్ డ్రైవర్ పై దాడి చేసిన యువకుల చర్య సరైందేనా?
డ్రైవర్పై దాడి ఎలా జరిగింది?
యువకులు డ్రైవర్ను కొట్టడమే కాకుండా, అవమానపరచి కాళ్లు మొక్కించుకున్నారని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు స్పందించారా?
స్థానికులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేయాలని కోరగా, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: