tirumala vanabhojanam

జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మోక్షమార్గం వైకుంఠద్వారం రానున్న జనవరి 10వతేదీ తెల్లవారుజామున 1.45 గంటలకు తెరచుకోనుంది. రానున్న ఏడాదిలో కూడా పదిరోజులుపాటు వైకుంకద్వారం తెరచి భక్తులకు మోక్షమార్గం దర్శనం చేయించేలా టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పదిరోజులపాటు దాదాపు 7 లక్షలమంది భక్తులు ఆరోజుల్లో వైకుందద్వార దర్శనం చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేయనుంది.

Advertisements

జనవరిలో వైకుంఠ ద్వారం తెరచి ఉంచే 10వతేదీ నుండి జనవరి 19వరకు పదిరోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. దర్శన టిక్కెట్, టోకెన్లు లేని భక్తులను ఆలయంలోపలకు అనుమతించరు. రాజ్యాంగపరిధిలోని ప్రొటోకాల్ విఐపీలు స్వయంగా వస్తేనే పరిమితంగా బ్రేక్ దర్శనాలు జారీచేస్తారు. ప్రత్యేక దర్శనాలు చంటిపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్వలు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవాణి ట్రస్ట్, తిరుపతిలో ఆన్లైన్లో టోకెన్లు జారీచేయనున్నారు.

-జనవరి 10న స్వర్ణరథం, 11న చక్రస్నానం:

పవిత్రమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన జనవరి 10వతేదీ శుక్రవారం ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు స్వర్ణరథం జరుగుతంది. శ్రీదేవిభూదేవిసమేతంగా మలయప్పస్వామివారు విశేష అలంకరణలో స్వర్ణరథాన్ని అధిరోహించి. ఆలయ మాధవీడుల్లో ఊరేగనున్నారు. 11వతేదీ ద్వాదశిరోజు పవిత్ర పుష్కరిణిలో స్వామివారి చక్రత్తాశ్వార్కు చక్రస్నాన మహోత్సవం జరిపిస్తారు..

Related Posts
ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ
NAYAN

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ Read more

Devi Sri Prasad: మందు సేవించడం అనేది ఒక వ్యసనం: దేవిశ్రీ ప్రసాద్
Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్: మద్యం అలవాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో పాల్గొని మద్యం అలవాటుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు సంగీత ప్రేమికులు, సినీ Read more

కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
Voters

ఛండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ Read more

అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి

అమీన్పూర్ మునిసిపాలిటీలోని శ్రీరామ్ హిల్స్ కాలనీలో ఆదివారం రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ జంట తమ ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతులను Read more

Advertisements
×