हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

ఉత్తరాఖండ్‌లో ఈరోజు నుండి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

sumalatha chinthakayala
ఉత్తరాఖండ్‌లో ఈరోజు నుండి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

డెహ్రాడూన్‌: యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి – యూసీసీ) అంటే… యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో ఒకటే పౌరచట్టం లేదు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయ్యి.. అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఈక్రమంలోనే బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో నేటి నుండి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు.

చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్నారు. పౌరులందరికీ సమానైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ప్రకటించారు. గతేడాది ఫిబ్రవ‌రి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత మార్చి 12న నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చ‌ట్టాన్ని ఈ ఏడాది జ‌న‌వ‌రి పూర్తిగా అమ‌లు చేయ‌నున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమ‌లు కోసం ప్రత్యేక పోర్టల్‌, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మ‌హిళ‌లు, పిల్లల సాధికార‌తే ల‌క్ష్యంగా యూసీసీ అమ‌లు ఉంటుంద‌ని సీఎం ధామి గ‌తంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాల‌న‌లో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌర‌స్మృతి అమ‌ల్లో ఉంది.

image

యూసీసీలో ఉన్న నిబంధనలేమిటో తెలుసుకుందాం..

. ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
. వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
. వివాహ నమోదు తప్పనిసరి.
. సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
. సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
. భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది. తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకోవచ్చు.
సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. చట్టాన్ని అతిక్రమిస్తే 6 నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు.
. 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు.
. తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా.. వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

📢 For Advertisement Booking: 98481 12870