అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సుంకాల కారణంగా చైనా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125%కి పెంచారు. దింతో అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకం ఛార్జ్ చేస్తుంది. ఈ కారణంగా చైనా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను విక్రయిస్తుంది, ఇవి చైనా ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, కానీ ఇప్పుడు కష్టంగా మారింది.
5% డిస్కౌంట్ ఆఫర్: అమెరికన్ మార్కెట్ కఠినంగా మారిన తర్వాత చైనా కంపెనీలు ఇప్పుడు భారతదేశంపై దృష్టి పెట్టాయి. దింతో చైనా కంపెనీలు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ET నివేదిక ప్రకారం, అమెరికాతో సుంకాల యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

డిస్కౌంట్ ద్వారా పెద్ద రిలీఫ్
చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5% డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున ఈ డిస్కౌంట్ పెద్ద రిలీఫ్ అవుతుంది. చైనా నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్ఫోన్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుండి అందుకుంటున్న డిస్కౌంట్ల ప్రయోజనాలను కస్టమర్లకి అందించవచ్చని భావిస్తున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుండి స్మార్ట్ఫోన్ల వరకు ప్రతిదీ చౌకగా మారవచ్చు. అమెరికా తర్వాత చైనాకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ కాబట్టి చైనా అమెరికాకు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, బొమ్మలు, దుస్తులు, వీడియో గేమ్లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, హీటర్లు, ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఆక్సెసోరిస్, వైద్య పరికరాల వరకు చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది.
READ ALSO: Microsoft Job Cuts: మే నెలలో మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోత?