Urvashi Sharada ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి

Urvashi Sharada : ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి

వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఊర్వశి శారద, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజకీయ జీవితం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడారు.ప్రజలకు సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ రంగం తనకు అనుకూలంగా అనిపించలేదని ఆమె పేర్కొన్నారు.శారద చెప్పిన విషయాల ప్రకారం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలోనే ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే ఆహ్వానం వచ్చినట్లు తెలిపింది.“ఆ సమయంలో రాజకీయాలంటే భయం వేసేది. పూర్తిగా తెలియని రంగం కావడం వల్ల నేను సున్నితంగా తిరస్కరించాను.నన్ను ఆహ్వానించిన వారితోనే ‘నాకు భయం, రాలేను’ అని చెప్పించాను” అని ఆమె చెప్పింది.అయితే, 1996లో రాజకీయాల్లోకి రావడానికి ఓ మలుపు కలిగింది.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను స్వయంగా ఆహ్వానించారట.

Advertisements
Urvashi Sharada ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి
Urvashi Sharada ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి

“చంద్రబాబు గారు నన్ను భరోసా ఇచ్చారు’ఏం భయపడొద్దు, నేనున్నాను’ అన్నారు.ఆయన మాటలే నాకు ధైర్యం ఇచ్చాయి.ఆ విశ్వాసంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను” అని ఆమె ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. తెనాలి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత, తన లక్ష్యం ప్రజల సమస్యలను పరిష్కరించడమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి సమస్యలపై గట్టి పోరాటం చేశానని తెలిపారు.”ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మలయాళీ అధికారులు నాకు ఎంతో సహకరించారు. నేను ఫైల్ పట్టుకెళ్తే, వారు సాయం చేయడం వల్ల పనులు త్వరగా పూర్తయ్యేవి.

ఈ అనుభవాలు మరిచిపోలేను” అని ఆమె ఉద్వేగంగా తెలిపారు.అయితే రాజకీయాల్లో ప్రయాణం అంత సాఫీగా సాగలేదని, కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయని ఆమె వాపోయారు.”ప్రజలు నిజంగా మంచివాళ్లే.కానీ కొందరు స్థానిక నాయకులకు నా నిజాయితీ నచ్చలేదు. నేను బలపడటం వాళ్లకు ఇష్టం లేదు.ఐదారుగురు నాయకులు కలిసి కుట్ర చేశారు.నన్ను ఓడించడానికి డబ్బాలు మార్చారని తెలిసింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఓటమి తర్వాత కూడా ఆమెలో అసహనం కనిపించలేదు. “అంతవరకే అదృష్టం ఉందని అనుకున్నాను. బాధపడలేదు” అని ఆమె అన్నారు రాజకీయాల్లోకి వచ్చిందంటే ప్రజల్ని ప్రేమించి, వారికి తిరిగి సేవ చేయాలనే ఆలోచనతోనే అని ఆమె స్పష్టం చేశారు.ఇప్పుడు శారద రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. చెన్నైలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు. “నాకు ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే రాజకీయం నుంచి తప్పుకున్నాను” అంటూ తన నిజాయితీని మరోసారి రుజువు చేశారు.

Read Also :Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

Related Posts
విమానంలో చిరంజీవి పెళ్లి వేడుక
విమానంలో చిరంజీవి పెళ్లి వేడుక

విమానంలో జరిపిన వివాహ దినోత్సవ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా, వేరే రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి వారు Read more

ఓటీటీ లోకి తండేల్ ఎప్పుడంటే?
తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించబడింది

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన Read more

కొత్త సినిమాలతో ఊరిస్తున్న డైరెక్టర్ ఎవరంటే?
కొత్త సినిమాలతో ఊరిస్తున్న డైరెక్టర్ ఎవరంటే

లొకేష్ కనగరాజ్, రజనీకాంత్‌ హీరోగా "కూలీ" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన ఇండస్ట్రీలో మరింత recognition పొందుతున్నారు. ఇక, ఆయన upcoming సినిమాల Read more

ఒక అసామాన్యుడి వీర విప్లవ గాధ.. విడుదల 2
vidudala 2

ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు, "విడుదల 2" చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×