ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అధికంగా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ మోసాలూ పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లకు మరింత భద్రత కల్పించేలా ముందడుగు వేసింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2025 నుంచే అమలులోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆటోమేటెడ్ సిస్టమ్‌

ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ (TCC) లేదా రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా ఛార్జ్ బ్యాక్ అప్రూవల్, రిజెక్షన్ల నిర్వహణకు ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఎన్‌పీసీఐ అమలు చేయనుంది. ఛార్జ్ బ్యాక్ అనేది వివాదాలు, మోసాలు, లేదా సాంకేతిక లోపం కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీని తిరిగి మార్చడం. ఆటోమేషన్ బల్క్ అప్‌లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన లావాదేవీలకు మాత్రమే వర్తించనుంది. తదుపరి సెటిల్ ‌మెంట్ సైకిల్‌లో పూర్తవుతుంది. అయితే, ఫ్రంట్ ఎండ్ యూడీఐఆర్ ఇంటర్‌ఫేస్ ద్వారా మాన్యువల్ ఇనిషియేట్ చేసిన ఛార్జ్ బ్యాక్‌లకు వర్తించదని ఎన్‌పీసీఐ తెలిపింది.

 ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

బ్యాంకులు ఛార్జ్ బ్యాంక్ వెంటనే లేవనెత్తేందుకు (T+0) అవకాశం ఉండడంతో సమస్య తలెత్తుతున్నట్లు ఎన్‌పీసీఐ గుర్తించింది. అదే రోజున డిస్‌ప్యూట్ అరైజ్ అవుతోంది. అయితే, దీంతో బెనిఫిషియరీ బ్యాంకులు ఛార్జ్ బ్యాక్ స్వీకరించే బ్యాంకులు కొన్ని పనులు చేయడానికి తగిన సమయం ఉండడం లేదు. దీంతో ట్రాన్సాక్షన్లను అంతర్గతంగా పునరుద్ధరించలేకపోవడం, రిటర్నులను ప్రాసెస్ చేయలేకపోవడం జరుగుతోంది. ఛార్జ్ బ్యాంక్ వ్యాలిడ్, అవాయిడ్ చేయాలా వద్దా వెరిఫై చేయలేకపోతున్నారు. ఛార్జ్ బ్యాంక్ ఇప్పటికే అరైజ్, సిస్టమ్ క్లోజ్ చేశాక బెనిఫిషరీ బ్యాంక్ రిటర్న్ రిక్వెస్ట్ చేస్తోంది. దీంతో ఆటోమేటెడ్ సిస్టమ్ రిటర్న్ తిరస్కరిస్తోంది. ఛార్జ్ బ్యాక్ ఇప్పటికే యాక్సెప్ట్ అయినట్లు భావిస్తోంది. సకాలంలో స్పందించకపోతే ఆటో క్లోజ్ అవుతోంది.

2025, ఫిబ్రవరి 15 నుంచి కొత్త ప్రక్రియ

ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆటోమేటెడ్ సిస్టమ్ తీసుకొస్తోంది. రెండు అంశాల ఆధారంగా ఛార్జ్ బ్యాంక్‌లను అంగీకరించాలా లేదా తిరస్కరించాలని నిర్ణయిస్తుంది. ట్రాన్సాక్షన్ క్రెడిట్ కన్ఫర్మేషన్ ఫండ్స్ సరిగ్గా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో లేదా వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత సెటిల్మెంట్ సైకిల్లో బెనిఫిషియరీ బ్యాంక్ చేసిన రిటర్నులు రిక్వెస్ట్ తీసుకోనుంది. కొత్త ప్రక్రియ 2025, ఫిబ్రవరి 15 నుంచి యూఆర్ఎస్‌సీ వ్యవస్థను అమలులోకి తీసుకొస్తోంది. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా సవరణలను సమీక్షించాల్సి ఉంటుంది.

Related Posts
లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా
Lok Sabha adjourned indefinitely

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఈరోజు నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో Read more

మణిపూర్ సమస్యపై ప్రధాని మోడీ వైఖరి – రిజిజు స్పందన
మణిపూర్ సమస్యపై ప్రధాని మోడీ వైఖరి – రిజిజు స్పందన

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మణిపూర్‌లోని సమస్యలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆచరణాత్మక పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. జాతి హింస ఫలితంగా ఏర్పడిన సమస్యను ప్రభుత్వం తీర్చడానికి Read more

వెల్‌వర్క్..కొత్త కార్యాలయ ప్రపంచానికి ఆరంభం
Wellwork..the beginning of a new office world

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వెల్‌నెస్-సెంట్రిక్ కో-వర్కింగ్ స్పేస్ ప్రారంభం. వెల్‌వర్క్, భారతదేశంలో తొలి వెల్‌నెస్-సెంట్రిక్ కో-వర్కింగ్ స్పేస్‌గా, వృత్తిపరులకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన పని వాతావరణాన్ని అందిస్తోంది. Read more

రైతుల ఖాతాల్లో రూ 10 వేలు?
rice paddy3

కొత్త సంవత్సరంలో రైతులకు మేలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ 10 వేలకు పెంపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *