हिन्दी | Epaper

TTD: అలిపిరి తనిఖీ కేంద్రంలో లైన్లు పెంపు

Ramya
TTD: అలిపిరి తనిఖీ కేంద్రంలో లైన్లు పెంపు

అదనంగా మరో మూడులేన్లు – క్రాస్ఓవర్లు నివారణకు చర్యలు

Tirumala: రోజుకు సరాసరి 10 వేలవరకు యాత్రికుల వాహనాలు.. 6వేలకు పైగా ట్యాక్సీలు, స్థానికుల వాహనాలు, కొండపై వ్యాపారుల వాహనాలు ఇలా 20 వేల వరకు తిరుమలకు చేరుతున్నాయి. ఇవిగాక భక్తులను సులభంగా తిరుమలకు చేరవేసేందుకు 450 వరకు ఆర్టీసి బస్సులు, వెయ్యివరకు ద్విచక్రవాహనాలు రోజువారీగా తిరుమలకు అలిపిరి తనిఖీ కేంద్రం నుండి దాటుకుని రావలసి ఉంది. ఈ వాహనాలను తనిఖీ కేంద్రంలో భద్రత సిబ్బంది నిశితంగా లగేజీలను, వాహనాలను తనిఖీ చేసిన తరువాత తిరుమలకు అనుమతిస్తారు.

TTD: అలిపిరి తనిఖీ కేంద్రంలో లైన్లు పెంపు

వేగంగా పెరుగుతున్న వాహనాల రద్దీ

ప్రస్తుతం సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12 లైన్లువరకు వాహనాలను నిర్వహిస్తుండగా ఇందులో మొదటి లైన్ పూర్తిగా అత్యవసర విభాగానికి చెందిన వాహనాల రాకపోకలు, తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే విజిలెన్స్, ఎస్పిఎఫ్, సెక్యూరిటీ, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సులభంగా వచ్చేందుకు ఉంది. ఆ తరువాత పక్కనే మొదటి లేన్ విఐపిల వాహనాలను అనుమతినిస్తారు. ఆ తరువాత యాత్రికుల వాహనాలకు వరుసగా 8లైన్లు కేటాయించారు. 9,10 లైన్లు ద్విచక్రవాహనాల కోసమే నిర్వహిస్తున్నారు. 11,12 లైన్లలో ఆర్టీసి బస్సులు, టిటిడికి చెందిన లగేజీ వాహనాలు, తిరుమలకు వస్తువులు తరలించే, ఆహారపదార్థాలు తరలించే అనుమతిపొందిన వాహనాలు తనిఖీ చేసి పంపుతారు. యాత్రికుల సంఖ్యతో పాటు వాహనాలు కూడా పెరగడంతో వేకువజామున 3గంటల నుండి అర్ధరాత్రి 12గంటల వరకు నిరంతరాయంగా చేపట్టే తనిఖీలు రద్దీసమయంలో మరింత ఆలస్యమై కిలోమీటర్లు వరకు వాహనాలు మొదటి ఆర్చి వరకు బారులు తీరుతున్నాయి. దీనివల్ల యాత్రికులు దర్శనానికి చేరుకునే సమయం కూడా ఆలస్యమవుతోంది. ఇవిగాక భక్తులను సులభంగా తిరుమలకు చేరవేసేందుకు 450 వరకు ఆర్టీసి బస్సులు, వెయ్యివరకు ద్విచక్రవాహనాలు రోజువారీగా తిరుమలకు అలిపిరి తనిఖీ కేంద్రం నుండి దాటుకుని రావలసి ఉంది.

సప్తగిరి తనిఖీ కేంద్రంలో వాహనాల క్రమబద్ధీకరణ

ఈ వాహనాలను తనిఖీ కేంద్రంలో భద్రత సిబ్బంది నిశితంగా లగేజీలను, వాహనాలను తనిఖీ చేసిన తరువాత తిరుమలకు అనుమతిస్తారు. ప్రస్తుతం సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12 లైన్లు వరకు వాహనాలను నిర్వహిస్తుండగా ఇందులో మొదటి లైన్ పూర్తిగా అత్యవసర విభాగానికి చెందిన వాహనాల రాకపోకలు, తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే విజిలెన్స్, ఎస్పిఎఫ్, సెక్యూరిటీ, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సులభంగా వచ్చేందుకు ఉంది. ఆ తరువాత పక్కనే మొదటి లైన్ విఐపిల వాహనాలను అనుమతినిస్తారు. ఆ తరువాత యాత్రికుల వాహనాలకు వరుసగా 8లైన్లు కేటాయించారు. 9,10 లైన్లు ద్విచక్రవాహనాల కోసమే నిర్వహిస్తున్నారు. 11,12 లైన్లలో ఆర్టీసి బస్సులు, టిటిడికి చెందిన లగేజీ వాహనాలు, తిరుమలకు వస్తువులు తరలించే, ఆహారపదార్థాలు తరలించే అనుమతిపొందిన వాహనాలు తనిఖీ చేసి పంపుతారు. యాత్రికుల సంఖ్యతో బాటు వాహనాలు కూడా పెరగడంతో వేకువజామున 3గంటల నుండి అర్ధరాత్రి 12గంటల వరకు నిరంతరాయంగా చేపట్టే తనిఖీలు రద్దీసమయంలో మరింత ఆలస్యమై కిలోమీటర్లువరకు వాహనాలు మొదటి ఆర్చి వరకు బారులు తీరుతున్నాయి. దీనివల్ల యాత్రికులు దర్శనానికి చేరుకునే సమయం కూడా ఆలస్యమవుతోంది. ఈ విషయాలను టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ వెంకయ్యచౌదరి, సివిఎసీ కెవి మురళీకృష్ణ పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేశారు.

Read also: Pithapuram: పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ పోస్టులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870