అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ అనేక దేశాలను భయపెట్టిస్తున్నారు. తాజాగా ప్రతీకార సుంకాలు విధిస్తూ మరింత టెన్షన్ పెడుతున్నారు. ముఖ్యంగా బుధువారం ఏయే దేశాలపై ఎంత టారిఫ్ విధిస్తున్నారో చెప్పగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మనుషులు ఉండే ప్రాంతాలపైనే కాకుండా.. జనావాసాలు లేని ప్రాంతాలపై కూడా ట్రంప్ టారిఫ్ విధిస్తున్నట్లు వెల్లడి అయింది. కేవలం పక్షులు, పెంగ్విన్లు మాత్రమే నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ఆయన టారిఫ్ ప్రకటించారు.

అగ్ని పర్వత ద్వీప్ జాన్ మాయెన్పై కూడా 10 శాతం సుంకం
ఇది మాత్రమే కాకుండా ట్రప్ ఆర్కిటిక్ మహా సముద్రంలోని అగ్ని పర్వత ద్వీప్ జాన్ మాయెన్పై కూడా 10 శాతం సుంకం విధించారు. అయితే ఇది నార్వేలోని టోమ్సోకు ఉత్తరం వైపున ఉంటుంది. ముఖ్యంగా 580 మైల్లో దూరంలో ఉన్న ఈ దీవుల్లో కూడా జనావాసాలు ఉండవు. కానీ పర్యాటకులకు అనుమతి ఉంటుంది. కేవలం ధ్రువపు ఎలుగు బంట్లు మాత్రమే అక్కడ ఆవాసం ఉంటుండగా.. ట్రంప్ 10 శాతం సుంకాలు విధించడంతో నావ్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై కూడా 10 శాతం సుంకాలు
ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్ విధించబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వెలుపల ఉన్న హర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై కూడా 10 శాతం సుంకాలు విధించారు. కేవలం ఇక్కడ సీల్స్, పెంగ్విన్లు, ఇతర పక్షలు మాత్రమే ఆవాసం ఉంటాయి. దీనిపై 10 శాతం టారిఫ్ విధించడంతో ఆ దేశ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రంప్ చర్య సరికాదంటూనే.. ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.