దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) (UGC) తీసుకువచ్చిన ‘ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్- 2026’ ఇప్పుడు దేశంలో పెను చర్చకు దారితీసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఈ రూల్స్ తీసుకువచ్చామని చెబుతుండగా.. మరోవైపు జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం వీటిని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ నిబంధనల అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు రావాలని KCRకు SIT నోటీసులు

యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపడమే వీటి ప్రధాన ఉద్దేశాలు
జనవరి 13వ తేదీన యూజీసీ ప్రకటించిన ఈ నిబంధనలు దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వర్తిస్తాయి. యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపడమే వీటి ప్రధాన ఉద్దేశాలు అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కుల వివక్షను అడ్డుకునేందుకు.. ఎస్సీ, ఎస్టీలతోపాటు.. ఈసారి జాబితాలో కొత్తగా ఓబీసీ విద్యార్థులను చేర్చారు. ఈ వర్గాలపై జరిగే వివక్షను అరికట్టడం కోసం వీటిని తెచ్చారు. ప్రతి కాలేజీ లేదా యూనివర్సిటీలో ‘ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ (ఈఓసీ)’.. ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు కమిటీ సమావేశం కావాలి. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం 24/7 హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలి. ఈ యూజీసీ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: