हिन्दी | Epaper

Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Aanusha
Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Telangana: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా అవ్వాలంటే అపారమైన కష్టపడాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

Read Also: Telangana Cabinet Meeting : ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలి

గత 10 ఏళ్లలో తెలంగాణ హరితాభివృద్ధికి ఎఫ్‌సీఆర్‌ఐ కీలక వేదికగా మారిందని తెలిపారు. అడవులను పరిరక్షించడం, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యూత్‌ను తయారు చేయడంలో ఎఫ్‌సీఆర్ఐ సంస్థలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఖాళీ అధ్యాపకుల పోస్టుల భర్తీతోపాటు.. సీనియర్ ఫ్యాకల్టీల నియామకం..

Telangana: Konda Surekha made interesting comments
Telangana: Konda Surekha made interesting comments

మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రతిపాదనలు పంపాలని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని భర్తీ చేస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలని పేర్కొన్న మంత్రి సురేఖ.. ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870