తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని ఢిల్లీకి వెళతారని సమాచారం.
Read Also: Fertilizer App: యూరియా యాప్ తో యాతన
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది
(Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ఓటేశారు. నిజామాబాద్ పట్టణంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టణంలో ఓటేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవాలని బండి సంజయ్ కోరారు.

మంచిర్యాలలోని హైటెక్సిటీలో 227వ నంబర్ పోలింగ్ బూత్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు వేశారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: