हिन्दी | Epaper

Stock Markets: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

Vanipushpa
Stock Markets: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, అధిక ముడిచమురు ధరల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు రెండు వారాల్లో ఎన్నడూ లేనంతగా పతనమయ్యాయి. ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,236.11 పాయింట్లు నష్టపోయి 82,498.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 365 పాయింట్లు పడిపోయి 25,454.35 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత సూచీలకు ఇదే అతిపెద్ద పతనం (సింగిల్ డే) కావడం గమనార్హం.

Read Also: Patna High Court Notices to Bihar MLAs: బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

 Stock Markets: Stock markets plunge with huge losses
Stock Markets: Stock markets plunge with huge losses

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితికి దారితీయడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ వంటి కీలక రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది. టెక్నికల్‌గా, నిఫ్టీ కీలకమైన 25,645–25,660 సపోర్ట్ స్థాయిని కోల్పోవడంతో అమ్మకాలు వేగవంతమయ్యాయని విశ్లేషకులు తెలిపారు. ఈ అమ్మకాల హోరులో సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ వంటి షేర్లు 3.2 శాతం వరకు నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.59 శాతం, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.27 శాతం చొప్పున పడిపోయాయి. రంగాలవారీగా నిఫ్టీ రియల్టీ, మీడియా, ఆటో రంగాలు అత్యధికంగా 2 శాతం మేర నష్టపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870