हिन्दी | Epaper

Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: ఐక్య పరిషత్ నివేదిక

Vanipushpa
Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: ఐక్య పరిషత్ నివేదిక

బంగ్లాదేశ్ (Bangladesh) 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.

మతపరమైన హింసాత్మక ఘటనలు

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.

Read Also: Breaking News: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?

Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: యూనస్ ప్రభుత్వ నివేదిక
Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: యూనస్ ప్రభుత్వ నివేదిక

కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్న మారణకాండ

కొత్త ఏడాది మొదలైనా హింస తగ్గకపోవడం గమనార్హం. జనవరి 2న లక్ష్మీపూర్‌లో సత్యరంజన్ దాస్ అనే రైతు వరి పొలానికి నిప్పు పెట్టారు. మరుసటి రోజు షరియత్ పూర్‌లో వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్‌ను కిరాతకంగా నరికి, నిప్పు పెట్టి చంపేశారు. ఛటోగ్రామ్, కుమిల్లా ప్రాంతాల్లో సాయుధ దుండగులు కుటుంబాలను బందీలుగా చేసి బంగారం, నగదు దోచుకున్నారు. ఝెనైదాలో ఓ హిందూ విధవరాలిని సామూహిక అత్యాచారం చేసి, గుండు గీసి, చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. జెసోర్‌లో ఐస్ ఫ్యాక్టరీ యజమాని రామ ప్రతాప్ బైరాగిని బహిరంగంగా గొంతు కోసి చంపడం అక్కడి అరాచక పాలనకు పరాకాష్టగా నిలిచింది.
ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు

బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు

ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్

ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని
0:45

మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

చేవెళ్ల ఆలయ పుష్కరిణిలో మృతదేహం
0:38

చేవెళ్ల ఆలయ పుష్కరిణిలో మృతదేహం

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

ఆంధ్రా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆంధ్రా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం

2027 జూన్ 26 నుంచి పుష్కరాలు ప్రారంభం

బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చి నా ఇంటిమీద దాడి చేశారు

బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చి నా ఇంటిమీద దాడి చేశారు

📢 For Advertisement Booking: 98481 12870