हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Kishan Reddy: రామ మందిరం నిర్మాణం అయోధ్యను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తోంది: కేంద్రమంత్రి

Sudha
Kishan Reddy: రామ మందిరం నిర్మాణం అయోధ్యను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తోంది: కేంద్రమంత్రి

రామ మందిరం నిర్మాణం అయోధ్యను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. IIM లక్నో నివేదిక ప్రపంచంలో ఆధ్యాత్మిక వారసత్వం ఎలా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందో వివరించిదని చెప్పుకొచ్చారు. రామ మందిరం నిర్మాణం తర్వాత అయ్యోధ్య నగరంలో వ్యాపారుల ఆదాయం ఐదు రెట్లు పెరిగిందని, 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు, రూ.10,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్టు తెలపారు. కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆధ్యాత్మిక, మతపరమైన క్షేత్రాలు తీర్థయాత్ర నేతృత్వంలో అభివృద్ధికి ఖచ్చితమైన నమూనాలుగా నిలిచాయని.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఒక కొత్త ప్రపంచ ప్రమాణం ఏర్పాటు చేయబడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య తన ప్రాచీన ఆధ్యాత్మిక వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా, అది ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉద్భవిస్తోందన్నారు. హైదరాబాద్ బయలుదేరే మార్గంలో, తాను IIM లక్నో రూపొందించిన ఒక ఆసక్తికరమైన నివేదికలో దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం పొందానని ఆయన తెలిపారు. నిర్ణయాత్మక నాయకత్వం, వ్యూహాత్మక ప్రణాళికతో సమలేఖనం చేయబడినప్పుడు, ఆధ్యాత్మిక వారసత్వం జాతీయ ఆర్థిక పునరుద్ధరణకు శక్తివంతమైన ఇంజిన్‌గా ఎలా మారుతుందో ఈ అధ్యయనం అందంగా వివరిస్తుందని చెప్పుకొచ్చారు. అయోధ్య దేవాలయ ఆర్థిక వ్యవస్థ అనేది అట్టడుగు స్థాయి అభివృద్ధిలో ఒక మాస్టర్‌క్లాస్ అని అన్నారు.

Read Also : Bihar Politics: బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

Kishan Reddy
Kishan Reddy

సామాన్యుల జీవితాల్లో దీని ప్రభావం చాలా లోతుగా ఉందని, 2021లో రోజుకు సుమారు రూ.400 సంపాదించిన ఒక చిన్న దుకాణదారుడు రామ మందిర నిర్మాణం తర్వాత రోజుకూ రూ. 2,500 దాకా సంపాధిస్తున్నాడన్నారు. ఇది ఆ వ్యపారుల రోజువారీ ఆదాయంలో ఐదు రెట్లు పెరుగుదల అని తెలిపారు. కేవలం ఆరు నెలల్లో 11 కోట్ల మంది సందర్శకులు రామ మందిరాన్ని దర్శించుకోవడం,1.2 లక్షల కొత్త ఉద్యోగాలు అంచనా వేయడంతో, నగరం శక్తివంతమైన ప్రభావాన్ని సృష్టిస్తోందన్నారు. ఈ కొత్త భారతదేశంలో, అయోధ్య దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న చాలా పెద్ద సాంస్కృతిక పునరుజ్జీవనానికి కిరీట రత్నంగా నిలుస్తుందన్నారు. ఈ పవిత్ర నగరం అనుభవాన్నే మార్చిన కాశీ విశ్వనాథ్ కారిడార్ అయినా, లేదా ఉజ్జయినిలోని మహాకల్ లోక్ గొప్పతనాన్ని అయినా, ప్రతి ప్రాజెక్ట్ ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దారితీసిందని తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్‌లోని దైవిక పునరుజ్జీవనం నుండి సోమనాథ్ పునరుజ్జీవనం వరకు, ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఇప్పుడు లక్షలాది మంది కళాకారులు, రవాణా కార్మికులు, హోటల్ సిబ్బంది, చిన్న వ్యవస్థాపకుల జీవనోపాధికి శక్తినిస్తున్నాయన్నారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నప్పుడే ఈ పరివర్తన స్థాయి అర్థమవుతోందన్నారు. అయోధ్య ఒక్కటే సంవత్సరానికి రూ.10,000 కోట్ల పెట్టుబడి, ఆదాయాన్ని ఆకర్షిస్తుందని, మనం ‘వికాస్ భీ, విరాసత్ భీ’ యొక్క నిజమైన సారాంశాన్ని మనం చూస్తున్నామన్నారు. ఇది తన సంస్కృతిని ఆదరించే భారతదేశం, అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గాన్ని శక్తివంతం చేస్తోంది. మన గతాన్ని గౌరవించినప్పుడు, ప్రతి పౌరుడికి మరింత సమృద్ధి, శక్తివంతమైన భవిష్యత్తును సురక్షితం చేస్తున్నామని మనం నిరూపిస్తున్నాం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870