Telangana Assembly: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కడియం శ్రీహరి మనస్ఫూర్తిగా స్వాగతించారు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పు చట్టబద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Read also: Netflix in hyderabad: ఐలైన్ స్టూడియోస్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి
What did Kadiyam Srihari say about the Speaker’s verdict?
కేసీఆర్ తీరుపై విమర్శలు
Telangana Assembly: తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే నాయకత్వానికి దూరంగా ఉంటున్నానని కడియం స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో సుమారు 36 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్, ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఒకప్పుడు సబబుగా అనిపించిన చేరికలు, ఇప్పుడు ఎలా తప్పవుతాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: