యు.కొత్తపల్లి (పిఠాపురం రూరల్) : పామాయిల్ తోటలో భారీ స్థాయిలో దాచిన గంజాయిని పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ గురువారం దాడి చేసి పట్టుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి. దొంతమూరు గ్రామ శివారు జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న పామాయిల్ తోటలో గంజాయి ఉన్నదని సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై జాన్ భాషా, తహసీల్దార్ గోపాలకృష్ణ సదరు ప్రదేశం వద్ద గాలింపు చేపట్టారు.
Read also: Sircilla Crime: ప్రియుడి బైక్ కోసం తల్లి నగలు అమ్మిన యువతి

East Godavari Crime
బస్తాలలో ఉన్న 92 కేజీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వాహనంలో తీసుకుని వచ్చి అక్కడ దాచి ఉండవచ్చునని భావించి,
సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాసు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: