అమెరికా-ఇజ్రాయెల్ సేనలు గత శనివారం జరిపిన మెరుపుదాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఖమేనీగానీ, అతనితోపాటు ఉన్న ఇతర నాయకులుగానీ తప్పించుకోలేకపోయారు. దాదాపు 40 మంది రక్షణశాఖ, ఇతర శాఖల ప్రధాన నాయకులు సైతం మరణించారు. దీంతో ఇరాన్ లో ఒకవర్గం ప్రజలు ఆనందంగా సంబరాలు జరుపుకుంటు ఉండగా మరోవర్గం తమ ప్రియతమ నాయకుడు ఇక లేడని కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు.
Read Also: Iran Israel War: హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్జీసీ

ప్రతీకారచర్యలతో ముదురుతున్న యుద్ధం
తమ దేశం నాయకుడు, ప్రధాన నాయకులు మరణించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ప్రతికార చర్యలకు పూనుకున్నది. ఇరాన్ మిస్సెల్స్ లతో యూఏఈ దేశాలను టార్గెట్ చేస్తూ దాడులకు పూనుకుంటున్నది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలలో పలుచోట్ల దాడులతో పాటు యూఏఈలోని విమానాశ్రయాలు, యూఎస్ విదేశీకార్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో యూఏఈకి అండగా ఫ్రాన్స్(France) రఫేల్ ఫైటర్ జెట్ల మోహరింపును ప్రకటించింది. ఫ్రాన్స్ రక్షణ మంనరతి జేన్ నోయల్ బారోట్ అమెరికా ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు అతీతంగా జరిగాయన్న ఫ్రాన్స్ ఇప్పటికే యుద్ధ నౌకలను తరలించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా శుక్రవారం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలను ఏర్పాట్లు చేస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: