కొవిడ్ టీకా వేయించుకున్న తర్వాత కొందరు మరణించడం లేదా తీవ్ర అనారోగ్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రభుత్వ గణాంకాలే ఈ మరణాలను ధృవీకరిస్తున్నాయని, ఇది ఎంతో విచారకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బాధితులు తమ తప్పు లేకపోయినా నష్టపోయారని కోర్టు అభిప్రాయపడింది.
Read also: Mangalagiri AIIMS Diarrhea:మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం

Supreme Court’s key verdict on Covid vaccine deaths
బాధిత కుటుంబాలకు భరోసా
రచన గంగు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. దీనివల్ల ఆర్థికంగా కుంగిపోయిన ఎన్నో కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.
కొత్త పరిహార పాలసీ అమలు
తప్పు ఎవరిదో నిరూపించాల్సిన అవసరం లేకుండానే పరిహారం అందించే ‘నో ఫాల్ట్ కాంపెన్సేషన్’ పాలసీని రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే త్వరితగతిన సహాయం అందుతుంది. సామాన్యుల ఆరోగ్యం మరియు ప్రాణ రక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: