అణ్వాయుధాల తయారీపై ఉత్తర కొరియా (North Korea) మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో అణు కార్యక్రమాలను ఉద్ధృతం చేసే ప్రణాళికను ప్యాంగ్యాంగ్ అధినేత కిమ్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. బహుళ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్ ప్రకటన చేసిన మరుసటిరోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం కిమ్ సమక్షంలో బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
Read Also: FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

దేశ అణు యుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం
“దేశ అణు యుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి తదుపరి దశ ప్రణాళికలను వెల్లడిస్తాం. ప్రస్తుతం చేపట్టిన ఈ పరీక్ష ఫలితం మనతో సైనిక ఘర్షణను రేకెత్తించడానికి ప్రయత్నించే శక్తులకు బాధాకరమైన మానసిక వేదన, తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇది మా వ్యూహాత్మక నిరోధక ప్రభావాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైనది.” అని కిమ్ అన్నారు. కిమ్తో పాటు ఆయన చిన్న కుమార్తె, ఉత్తర కొరియా సీనియర్ అధికారులు కలిసి ఈ ప్రయోగాన్ని వీక్షించారని KCNA తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించగా, ఇందులో రెండు క్షిపణులు దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల ల్యాండ్ అయ్యాయి. భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడుల కచ్చితత్వం మెరుగుపడినట్లు పేర్కొంది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. తదుపరి దశ అణు కార్యక్రమాలను వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయటం ఐదేళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: