हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

silver price crosses : వెండి ₹3 లక్షలు దాటింది! ఇంకా పెరుగుతుందా? నిపుణుల హెచ్చరిక

Sai Kiran
silver price crosses : వెండి ₹3 లక్షలు దాటింది! ఇంకా పెరుగుతుందా? నిపుణుల హెచ్చరిక

silver price crosses : దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరి కొత్త మైలురాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుండటంతో, దేశీయంగా Multi Commodity Exchange (MCX)లో వెండి ధర కిలోకు రూ.3,01,000కు పైగా పలికింది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10,000 పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

స్థానిక మార్కెట్లో కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ.1,000 పెరిగి రూ.30,500కు చేరగా, 10 గ్రాముల ధర రూ.3,050గా నమోదైంది. జనవరి నెలలోనే వెండి ధరలు 28 శాతానికి పైగా పెరిగి, బంగారాన్ని కూడా మించిన రాబడులను ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా (silver price crosses) ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలను నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump సుంకాల ముప్పును మళ్లీ తెరపైకి తీసుకురావడం, యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు వెండి, బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు కూడా వెండి ధరలకు మద్దతుగా మారాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు 100 డాలర్లకు మించిన స్థాయిలను చేరే అవకాశం ఉంది. అయితే ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిల్లో ఉన్నందున కొత్త పెట్టుబడిదారులు ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, ఎస్‌ఐపీ విధానంలో లేదా దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థల నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870