Gold Rate 08/01/26 : పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో పాటు దేశీయ మార్కెట్లో కూడా పసిడి రేట్లు దిగొచ్చాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.
కొత్త సంవత్సర ప్రారంభం నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ఆల్టైమ్ హై స్థాయిలకు చేరువయ్యాయి. గతేడాది బంగారం ధరలు 70 శాతం పైగా పెరగగా, వెండి ధరలు ఏకంగా 170 శాతం కంటే ఎక్కువగా ఎగబాకాయి. ఈ నేపథ్యంలో (Gold Rate 08/01/26) ఇన్వెస్టర్లు లాభాల్ని వసూలు చేసుకునేందుకు ప్రాఫిట్ బుకింగ్ చేపట్టడంతో ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4440 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది ఒక దశలో 4500 డాలర్లకు చేరువైంది. అదే విధంగా వెండి ధర కూడా తగ్గింది. ఒకరోజు ముందు ఔన్సుకు 81 డాలర్లు దాటిన సిల్వర్ రేటు ఇప్పుడు 78 డాలర్ల పరిధిలో కదులుతోంది.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా (Gold Rate 08/01/26) కూడా పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 500 తగ్గి రూ. 1,26,750కి చేరింది. గత రెండు రోజుల్లో ఈ ధర రూ. 2750 వరకు పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 550 తగ్గి రూ. 1,38,270గా నమోదైంది.

అయితే బంగారం తగ్గినప్పటికీ వెండి మాత్రం ఇంకా (Gold Rate 08/01/26) పుంజుకుంటోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర మరో రూ. 6,000 పెరిగి కేజీకి రూ. 2.77 లక్షలకు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ. 20 వేల వరకు పెరగడం విశేషం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: