Gold rate today : బంగారం కొనాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన పసిడి ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరలు వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.
భారత్లో బంగారానికి అపారమైన డిమాండ్ ఉంది. పండుగలు, వివాహాలు, శుభకార్యాలు, పెట్టుబడి అవసరాలు వంటి అనేక కారణాలతో బంగారం కొనుగోలు చేస్తుంటారు. దేశంలో వినియోగం అధికంగా ఉండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థిక స్థిరత్వం కోసం రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారం నిల్వలను పెంచుతోంది. భారతీయుల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటం విశేషం.
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,41,350 వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరి 16న రూ. 1200, 17న రూ. 2050 తగ్గిన తర్వాత ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 1,54,200గా ఉంది.
Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 2.60 లక్షలుగా ఉంది. గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,950 డాలర్లకు పైగా పెరిగింది. వెండి ధర కూడా 72 డాలర్ల నుంచి 77 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయ మార్కెట్లో రాబోయే రోజుల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశముంది, దేశీయంగా ఫిబ్రవరి 19 ఉదయం 10 గంటల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: