ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతి చెందారు. గత నెల రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, చికిత్స ఫలించక శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అనేక చిత్రాలలో తనదైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమ సర్కిల్స్ లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది.
కిడ్నీ మార్పిడికి 50 లక్షలు అవసరం – ప్రభుత్వం భరోసా
వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయడం లేదని తెలిపారు. వెంటనే మార్పిడి చేయాల్సి ఉంటే దాదాపు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వెల్లడించారు. మంత్రి వాకిటి శ్రీహరి వెంకట్ను పరామర్శించి, చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కూడా ఆర్థికంగా సాయం చేశారు.
కిడ్నీ దాత దొరకక మృతి – కుటుంబంలో విషాదం
అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కిడ్నీ దాత దొరకకపోవడంతో వెంకట్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. వైద్యం అందించినా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయన మృతిచెందారు. ఫిష్ వెంకట్ కుమార్తె మీడియాతో మాట్లాడుతూ, “చివరి వరకూ ఆశ వదలలేదు… కానీ కిడ్నీ దాత లభించక మేము ఆయనను కోల్పోయాం,” అని కన్నీటి శబ్దంలో చెప్పారు. అభిమానుల మధ్య చిరస్మరణీయమైన నటుడిగా ఆయన పేరెన్నిక పొందారు.
Read Also : Alliance of India : ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆప్