అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad plane crash) ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఉపయోగించిన విమానం బోయింగ్ 787-8 (Boeing 787-8)డ్రీమ్ లైనర్, ఇది 2011లో ప్రారంభమైనప్పటి నుండి అత్యంత విశ్వసనీయంగా పరిగణించబడుతోంది. ఇప్పటి వరకు ఏ ప్రాణహానికీ కారణం కాలేకపోవడం ఈ ఎయిర్క్రాఫ్ట్ విశిష్టత. అయితే తాజాగా అహ్మదాబాద్లో జరిగిన ఘటనతో దీనికి సంబంధించి ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదంగా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బోయింగ్ 787-8
బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ 787-8 డ్రీమ్ లైనర్ ఖండాంతర ప్రయాణాలకు అనువుగా రూపొందించబడింది. ఒకేసారి 248 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. ఇది 13,530 కిలోమీటర్లు ఒకే సారి ప్రయాణించగల సామర్థ్యం కలిగిన విమానం. పైగా సాధారణ ఎయిర్క్రాఫ్ట్లతో పోలిస్తే ఇది ఇంధన వినియోగాన్ని 25% వరకు తగ్గించగలదు. అందుకే ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ విమానంగా గుర్తింపు పొందింది.
అత్యాధునిక సాంకేతికత ఉన్నా… ప్రమాదం తప్పలేదెందుకు?
ఇంత అధునాతన సాంకేతికత, విశ్వసనీయత ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరగడం aviation నిపుణులను ఆశ్చర్యంలో పడేసింది. బోయింగ్ 787-8 వంటి విమానం ఎలాంటి లోపంతో ప్రమాదానికి గురైందో తెలుసుకునేందుకు ప్రస్తుతం విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వలన బోయింగ్ విమాన భద్రతాపై, మానవీయ తప్పిదాలపై విమర్శలు, విశ్లేషణలు మళ్లీ మొదలయ్యాయి. అది ఎయిర్ ఇండియా, బోయింగ్ ఇద్దరికీ పాఠంగా మారనుంది.
Read Also : Chandrababu Naidu : నేటి నుంచి కీలక హామీ అమలు : చంద్రబాబు