ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు రీల్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రాణాంతకమైన పనులు చేస్తూ అందరినీ షాక్కు గురి చేస్తున్నారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైలు పట్టాలపై పడుకుని వీడియో తీస్తోంది. ఇంతలో రైలు సమీపానికి దూసుకొచ్చింది.
తెగ వైరల్ అయిన వీడియో
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రైలు పట్టాలపై వినూత్నంగా రీల్ చేయాలని అనుకుంది. రైలు పట్టాలపైకి వెళ్లిన ఆమె.. వాటి మధ్యలో పడుకుని, రెండు చేతులూ ముందుకు చాపి ఫోన్ పట్టుకుని కెమెరా ఆన్ చేసింది. కాసేపటి తర్వాత ఎదురుగా రైలు దూసుకొచ్చింది. రైలు దూసుకొస్తున్నా కూడా ఆమె ధైర్యంగా ఫోన్ పట్టుకుని అలాగే పడుకుంది. రైలు ఆమె మీదుగా దూసుకెళ్లింది. ఇదంతా ఆ ఫోన్లో రికార్డ్ అయింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. రైలు పట్టాలపై మహిళ పడుకుంది నిజమే కానీ.. తర్వాత ఫోన్ మాత్రమే అక్కడ పెట్టి, ఆమె పక్కకు వచ్చేసింది. రైలు వస్తున్న దృశ్యాలన్నీ ఫోన్లో రికార్డ్ అయ్యాయి. అయితే రెండు సీన్లను కలిపి చూడడం వల్ల ఆమే రైలును వీడియో తీసినట్లుగా అనిపిస్తుంది.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అయినా ఇలంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం ప్రమాకరమని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెను చూసి మిగతా వారు కూడా నేర్చుకుంటారు’’.. అంటూ కొందరు, ‘‘రీల్స్ పిచ్చి పీక్స్కు వెళ్లడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్లు, 8.59 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. అందరూ అనుకున్నట్లుగా, ఈ వీడియో మొదటి నిమిషంలో ఆమె రైలు పట్టాలపై పడిపోతూ, రైలును వీడియో తీస్తూ కనిపిస్తున్నా, నిజంగా ఆమె పట్టాలపై పడలేదు. ఆమె ఫోన్ పెట్టినప్పుడు మాత్రమే పట్టాలపై కనిపిస్తుంది, కానీ ఆమె ఫోన్ పక్కకు వచ్చి, రైలు దూసుకెళ్లే దృశ్యాన్ని ఆ ఫోన్లో రికార్డు చేసింది. దీనితో వీడియోలో ఉన్న రెండు సీన్లు కలిపితే, ఆమె రైలు పట్టాలపై పడిపోయి వీడియో తీసినట్లు అనిపిస్తుంది.ఈ రకాల పిచ్చి పనులు ఇప్పటికీ ప్రజల్లో మరింత సంచలనాలు సృష్టిస్తున్నాయి. వీడియోల సృష్టి కోసం ప్రాణాలను పణంగా పెట్టడం, వాటి ప్రభావం కూడా కొంతమంది చిన్నారులకు, యువతకు ప్రతికూలంగా ఉండవచ్చు. రీల్ చేసిన ఈ మహిళ ప్రాణం కోల్పోయినా సరే, వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి చర్యలు జరగకుండా, పర్యవేక్షణ, అవగాహనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.