డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

Diego Maradona: డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చనిపోయిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయన మృతికి గల కారణం తెలిసింది. మారడోనా వేదనతో మరణించి ఉంటాడని పోస్టుమార్టంలో పాల్గొన్న ఒక నిపుణుడు తెలిపారు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్య నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకున్న నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు.

Advertisements
డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు
మారడోనా గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు ఉందని డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించి ఉంటాడని వివరించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న మారడోనా నవంబర్ 25, 2020న 60 ఏళ్ల వయసులో బ్యూనస్ ఎయిర్‌లోని అద్దె ఇంట్లో మరణించాడు. మారడోనా కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్‌ వ్యసనంతో బాధపడ్డాడు.
నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి (పల్మనరీ ఎడెమా) కారణంగా మరణించినట్టు గుర్తించారు.

Related Posts
Trump : ఆరోగ్య, మానవ సేవల విభాగంలో భారీ ఉద్యోగాల కోత
చర్చానీయాంశంగా మారిన ట్రంప్​ 'మూడోసారి' ఎన్నిక

Trump : ఆరోగ్య, మానవ సేవల విభాగంలో భారీ ఉద్యోగాల కోత అమెరికాలో ఉద్యోగాల కొరత మరింత ముదురుతోంది. ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా ఆరోగ్య, మానవ సేవల Read more

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నారీ లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళల శక్తి Read more

వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై
వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై

చాంపియన్స్ ట్రోఫీ-2025 లో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన అతను నిర్ణయాన్ని ప్రకటించాడు. Read more

ఏం పట్టావ్ భయ్యా క్యాచ్!
ఏం పట్టావ్ భయ్యా క్యాచ్!

హామిల్టన్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 113 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ను 2-0తో తమ ఖాతాలో వేసుకుంది.మ్యాచ్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×