గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్

Pawan kalyan: గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్

కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ఆయన పంట కుంట నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కదానికి ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు సేద్యంతో పాటు వాటి చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసినట్లు వివరించారు.

గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్

రైతులకు దీర్ఘకాలిక ఆదాయం
నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. నీటిని నిల్వచేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేశాం. 1.55 లక్షల పంట కుంటలు నిండితే మనకు ఇబ్బంది ఉండదు. వీటి చుట్టూ అరటి, నిమ్మ, దానిమ్మ వంటి మొక్కలు పెంచితే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. బాతులు, చేపల పెంపకానికి కూడా దోహదం చేస్తుంది.
ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు
గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని పవన్ విమర్శించారు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామని చెప్పారు. ప్రజలకు ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. వంద మందికిపైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించినట్లు వివరించారు.
“గెలుపులోనే మనుషులను లెక్కించమని కష్టసమయంలో ఎలా ఉన్నారనే చూస్తాం. కష్టసమయంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం.
ఉపాధి హామీ పథకం బకాయిలు త్వరలో విడుదల
‘జాతీయ ఉపాధి హామీని రాజకీయ కూలీల ఉపాధిగా మార్చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం. ఉపాధి లేని వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి కల్పిస్తోంది. నాకు ఉపాధి అవసరమైనప్పుడు నేను కూడా నరేగా ద్వారా పనిచేస్తా అన్నారు పవన్ కల్యాణ్.

Related Posts
ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ
Discussion on budget from today in AP

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. Read more

విద్యార్థుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ
విద్యార్థుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా, ఈరోజు పవన్ Read more

మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు
Diwakar travels bus caught fire in anantapur

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో Read more

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు
Kurnool

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యంత పేదరికాన్ని ఎదుర్కొంటున్న జిల్లాగా సోషియో-ఎకనామిక్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం, కర్నూలు జిల్లాలో 42 శాతం మంది ప్రజలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *