हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

Sudheer
AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

భారతదేశంలో డిజిటల్ రంగంలో మరో గొప్ప అడుగు పడింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని నవరాయ్‌పూర్‌లో దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కేవలం డేటా నిల్వ చేయడానికి మాత్రమే కాకుండా, డిజిటల్ యుగానికి వెన్నెముకగా నిలవనుందని ఆయన చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ డిజిటల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

రాక్‌బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు

ఈ డేటా సెంటర్ పార్క్‌ను రాక్‌బ్యాంక్ డేటాసెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తుండగా, ఇందులో 2.7 హెక్టార్ల విస్తీర్ణం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఇది దేశంలో డేటా భద్రత, అనలిటిక్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మరింత అభివృద్ధికి దోహదం చేయనుంది.

ఉపాధి అవకాశాలతో యువతకు నూతన దారి

ఈ డేటా సెంటర్ పార్క్ వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. దాదాపు 1,500 మంది పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల యువత ఇకపై ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి సాంకేతిక రంగంలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు.

Read Also : Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870