ఒక్కరోజే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

Alert: ఒక్కరోజే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రెండు రోజులుగా కాస్తున్న ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే రోడ్లపై జనాలు కూడా కనిపించడం లేదు. ఇళ్లలోనే సేద తీరుతూ ఉక్కపోతకు అల్లాడుతున్నారు. రెండు రోజులూ హైదరాబాద్​, ఉమ్మడి నల్గొండ​ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంటున్నప్పటికీ, ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 41.0 డిగ్రీల సెల్సియస్​ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుర్రంపోడులో నమోదైంది.

ఒక్కరోజే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగే అవకాశం
గురువారం హైదరాబాద్​ నగరంలో నాచారం, ఎల్​బీనగర్​, జూబ్లీహిల్స్​, కాప్రా, యూసుఫ్​గూడ, బేగంపేట ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే రాజేంద్రనగర్​, గాజులరామారంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఉమ్మడి నల్లొండ జిల్లాల్లో 36 ప్రాంతాలకు ఆరెంజ్​ అలర్ట్​
అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా గుర్రంపోడులో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 41.0 డిగ్రీల సెల్సియస్​ నమోదు అయింది. మరోవైపు నల్గొండ జిల్లాలో 36 ప్రాంతాల్లో ఆరెంజ్​ హెచ్చరిక స్థాయిలో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏడు ప్రాంతాల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. ఇందులో సూర్యాపేట జిల్లాలో 11 ప్రాంతాలు, యాదాద్రి జిల్లాలో 10 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా ఇలానే ఉన్నాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

Related Posts
బాలిక పై కన్నతండ్రే అఘాయిత్యం
బాలిక పై కన్నతండ్రే అఘాయిత్యం

నాన్న అంటే ఆశ్రయం, రక్షణ, భద్రత. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. ప్రతి తండ్రి తన బిడ్డల కోసం తమ జీవితాన్ని అర్పిస్తారు. Read more

పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం
పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో Read more

ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్
women sewing

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని Read more

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డు
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ: ఆధునిక సాంకేతికతతో సౌలభ్యం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రతిపాదనలు రూపొందించింది. రేషన్ షాపుల్లో సరఫరా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *