పరీక్ష రాసి అంతక్రియలు చేసిన కుమారుడు
Yadadri incident: జీవితంలో ఎదురయ్యే అత్యంత దారుణమైన బాధ కన్నతండ్రిని కోల్పోవడం. అదీ తన భవిష్యత్తుకు తొలి మెట్టు లాంటి పదో తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో అలాంటి విపత్తు ఎదురైతే? సరిగ్గా ఇదే వేదనను అనుభవించాడు హర్షవర్ధన్ అనే విద్యార్థి. తన తండ్రి మృతదేహం ఇంటి ముందు ఉండగా, కన్నీటిని దిగమింగుకుని పరీక్ష రాసి తండ్రి ఆశయాన్ని నిలబెట్టాడు.
Read Also :Palghar Train Accident: రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం

అసలేం జరిగింది?
మోత్కూర్కు చెందిన కూరేళ్ల ఎల్లయ్య వస్తాకొండూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన పెద్ద కుమారుడు హర్షవర్ధన్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కుమారుడిని గొప్ప ప్రయోజకుడిని చేయాలని ఎల్లయ్య ఎప్పుడూ కలలు కనేవారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కావద్దని కొడుకుకు ధైర్యం చెప్పి, రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అయితే, అర్థరాత్రి సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ఎల్లయ్య ప్రాణాలు విడిచారు.
దుఃఖాన్ని దిగమింగుకుని..
తెల్లవారితే పదో తరగతి మొదటి పరీక్ష. ఇంట్లో తండ్రి విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ఇల్లంతా విషాదంలో మునిగిపోయింది. కానీ, నాన్న కన్న కల నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని భావించిన హర్షవర్ధన్, పుట్టెడు దుఃఖంతోనే పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాస్తున్నంత సేపూ నాన్న జ్ఞాపకాలే తనను కన్నీరు పెట్టించగా, ఆ దృశ్యాన్ని చూసి తోటి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సైతం చలించిపోయారు. పరీక్ష ముగిసిన వెంటనే ఇంటికి చేరుకున్న హర్షవర్ధన్, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెట్టాడు. తండ్రి మరణం వంటి పెను విపత్తును తట్టుకుని, ఆయన ఆశయం కోసం పరీక్ష రాసిన హర్షవర్ధన్ ధైర్యం అందరినీ కదిలించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: