हिन्दी | Epaper

Mrigasira Karthi : మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలంటే?

Sudheer
Mrigasira Karthi : మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలంటే?

మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజు చేపలు తినే ఆచారం చాలాచోట్ల కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆస్తమా బాధితులు ఈ రోజు చేపల ప్రసాదం (fish prasadam) తీసుకుంటారు. దీనికి వాతావరణ మార్పులే ప్రధాన కారణం. మృగశిర కార్తె సమయానికి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వాతావరణం తేమతో నిండి, శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా కనిపిస్తాయి.

శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర

ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చేపలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శ్వాసకోశాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలాగే విటమిన్ డి, ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఐోడిన్ వంటి పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

మృగశిర కార్తె రోజున చేపలు తినడం సంప్రదాయం

అందుకే మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఒక ఆరోగ్య పరమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బత్తిన కుటుంబం ఆస్తమా రోగులకు చేప ప్రసాదం అందించడమూ ఇదే కారణంతో ప్రారంభమైంది. ఈ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకుంటే, మానవ శరీరానికి ప్రకృతి ఎలా తోడుగా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సహజ మార్గాల్లో ఆరోగ్యాన్ని సాధించాలనుకునే వారికి ఇది ఒక ప్రాచీన సంప్రదాయంలోని విలువైన భాగమని చెప్పవచ్చు.

Read Also : Fish Prasadam Distribution : నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870