తెలంగాణ(Telangana) రాష్ట్రంలో యూరియా(Urea) పంపిణీని మరింత పారదర్శకంగా, నియంత్రితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా బుకింగ్ కోసం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ను ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ యాప్ ద్వారా రైతులు ముందుగా బుకింగ్ చేసుకుంటేనే యూరియా బస్తాలు పొందే అవకాశం ఉంటుంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకోవడం, నిజమైన రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చేయడం ఈ విధానానికి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
read also: Smartphone: భారత్లో రియల్మీ 16 ప్రో సిరీస్ విడుదల

24 గంటల నిబంధన, ఆలస్యం అయితే పరిమితులు
యాప్లో యూరియా(Urea) బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల్లోగా సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి బస్తాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా వెళ్లకపోతే, అదే బుకింగ్ రద్దయినట్టుగా పరిగణించి మళ్లీ 15 రోజుల వరకు కొత్తగా బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే రైతులు బుకింగ్ చేసిన ఒక గంట పూర్తైన తర్వాత నుంచే యూరియా బస్తాలను తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా డీలర్ల వద్ద గందరగోళం తగ్గుతుందని, సమయపాలన మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
పంటల వారీగా యూరియా లిమిట్లు
కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం పంటల ఆధారంగా యూరియా పరిమితులను కూడా నిర్ణయించింది.
- వరి పంటకు ఎకరాకు 2.5 బస్తాలు
- మక్క, ఇతర పంటలకు ఎకరాకు 3 బస్తాలు
- మిర్చి పంటకు ఎకరాకు 5 బస్తాలు వరకు మాత్రమే యూరియా అందజేయనున్నారు.
ఈ లిమిట్ల ద్వారా అవసరానికి మించిన వినియోగాన్ని నియంత్రించి, అందరికీ సమానంగా ఎరువులు అందేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రైతులు యాప్ వాడకంపై అవగాహన పెంచుకుని, సమయానికి బుకింగ్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
ఫర్టిలైజర్ యాప్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
ఈ నెల 22 నుంచి తెలంగాణ అంతటా అమలులోకి వస్తుంది.
బుక్ చేసిన తర్వాత ఎంత సమయంలో యూరియా తీసుకోవాలి?
24 గంటల్లోగా తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: