తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ (Co-Chairman of Sports Hub) గా ఏర్పాటులో భాగంగా, టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ సతీమణి, అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఉపాసన (Upasana Konidela) ను కో-ఛైర్మన్గా నియమించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకాను ఛైర్మన్గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
ఈ సందర్భంగా ఉపాసన (Upasana Konidela) స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను ఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంటూ, “సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం ఒక గొప్ప అవకాశం” అని అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారికు, అలాగే క్రీడలు, యువజన సేవల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతను క్రీడల అభివృద్ధికి ఉపయోగించుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025’ క్రీడల రంగాన్ని వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: