తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) చీఫ్ తీన్మార్ మల్లన్న ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన జీవో నంబర్ 9 జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని, దానికి బాధ్యతగా సీఎం వెంటనే రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఆందోళన రూపంలో TRP నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది.
రాశి ఫలాలు – 10 అక్టోబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మల్లన్న మాట్లాడుతూ, “బీసీలకు న్యాయం చేయాలన్న హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. హైకోర్టు ముందే నిలబెట్టుకోలేని విధంగా జీవో రూపొందించడం బీసీ హక్కుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం” అని విమర్శించారు. బంద్ సమయంలో పార్టీ కార్యకర్తలు, బీసీ సంఘాలు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నిర్ణయంతో పలు బీసీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు పట్ల నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిలిపివేత, వ్యాపార సంస్థలు మూసివేత వంటి చర్యలు జరగే అవకాశముంది.

ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇతర రాజకీయ నేతలు కూడా స్పందించడం మొదలుపెట్టారు. బీసీ సంఘాల నాయకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ ప్రతిస్పందనను పరిశీలించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని నిన్న పేర్కొన్నారు. ఆయన ప్రకారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం మంచిదే కానీ, చట్టపరంగా బలమైన విధంగా చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ప్రభుత్వం బీసీల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే, చట్టపరంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/