— పన్నురహిత ఆదాయంపై దృష్టి కేంద్ర గ్రాంటులపై ఆశలు ఆస్తుల ద్వారా సేకరించే ఆలోచన
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంక్షేమ పధకాలు, కార్యక్రమాలకు అవసరమైన వ్యయాన్ని సేకరించేందుకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసా (Rythu bharosa) తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇందుకు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని అధికమించేందుకు ప్రత్యమ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.33,600 కోట్లు
ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.33,600 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించింది. సమయంలో కేంద్ర గ్రాంట్లను తెచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. అన్ని విభాగాలకు బడ్జెట్ కేటాయింపులను సమానంగా పాటించాలని స్పష్టం చేసినప్పటికీ, లోటు దృష్ట్యా ఆదాయాన్ని ఆర్జించే విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గతంగా ఆర్థిక శాఖ సూచనలు చేసినట్లు సమాచారం. హేతుబద్ధీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు లేకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయ లక్ష్యాలను పూర్తిగా చేరుకునే సామర్థ్యం పరిమితమైంది. పన్నుయేతర ఆదాయాన్ని పెంచడం మరియు ఆర్థిక స్థితిస్థాపకతను మెరుగుపరచడం లక్ష్యంగా కార్యాచరణ వ్యూహాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదే ఆదాయంలో గత నెల ప్రారంభం నాటికి కేవలం 6.23 శాతం మేర 10,916.68 కోట్లు వసూలు చేసింది. ఇది ఏప్రిల్ 2024లో సమీకరించిన రూ.11,464.17 కోట్ల కంటే దాదాపు రూ.548 కోట్లు తక్కువ. పన్నుయేతర ఆదాయ గణాంకాలు ఇంకా తక్కువగా ఉన్నాయి, గత సంవత్సరం ఇదే కాలంలో రూ.353.71 కోట్లు వసూలు చేయగా, ఏప్రిల్ చివరి నాటికి రూ.253.60 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అయితే, కేంద్రం నుండి గ్రాంట్స్ ఇన్ఎయిడ్ స్వల్ప మెరుగుదలను చూపించింది. గత ఏడాది సున్నా పంపిణీతో పోలిస్తే ఈ ఏప్రిల్లో రూ.68.85 కోట్లు విడుదలయ్యాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు. భూమిని నిర్మాణాత్మక లీజుకు ఇవ్వడం. వేలం వేయడం వంటి వాటిపై కేంద్రీకరించింది. అలాగే గనులు మరియు ఖనిజాల నుండి, ముఖ్యంగా ఇసుక మైనింగ్ నుండి పన్నుయేతర ఆదాయాన్ని పెంచడానికి అధికారులు కొత్త ఖనిజ విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Read also: Hyderabad: ట్యాంక్ బండ్ పై ఘనంగా కుమ్మర్ల తొలిబోనం జాతర