हिन्दी | Epaper

Telugu news: TG: ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా తెలంగాణ పసుపు: తుమ్మల

Tejaswini Y
Telugu news: TG: ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా తెలంగాణ పసుపు: తుమ్మల

TG: తమ ప్రభుత్వ విజన్ వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్గా చూస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. బుధవారం సిసిఐ తెలంగాణ, నేషనల్ టర్మిరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్-2025(Turmeric Value Chain Summit-2025) లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పసుపు పంటను ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వ ఆగ్రి విజన్ లో పసుపుకి కూడా పాత్ర ఉందని చెప్పారు.

Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు

Telangana turmeric targeting global market Thummala

నేషనల్ టర్మరిక్ బోర్డు రైతులకు దిశ చూపాలి

మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్(Nutraceuticals), ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగు తోందని వెల్లడించారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. పసుపును అధికంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ(TG) కూడా ఒకటని, ఆర్మూర్ పసుపుకు జిఐ ట్యాగ్ రావడం రైతులకు గర్వకారణమన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ బోర్డు కార్యాలయ పరిమితుల్లో కాకుండా, రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా పనిచేయాలన్నారు.

పరిశోధనను పొలాలకు తీసుకెళ్లాలన్నారు. మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో నాయకత్వం వహించాలని సూచించారు. తెలంగాణలో అనుకూల వాతావరణం, శ్రమించే రైతులు ఉన్నప్పటికీ ధరల హెచ్చు, తగ్గుల కారణంగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్వింటా పసుపు ఉత్పత్తికి రూ.9 వేల వరకు ఖర్చు అవుతుండగా, మార్కెట్లో రూ.12 వేలు మాత్రమే ఉండటం రైతులను నిరుత్సాహపరు స్తోందన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు విజన్ 2047కు అనుగుణంగా పనిచేసి, ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్ సంకేతాలు అందించాలన్నారు.

ప్రామాణిక మాయిశ్చర్ మీటర్లు, ఒకే రకమైన తేమ ప్రమాణాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ అమలు చేయాల్సి ఉందని చెప్పారు. అధిక కర్క్యూమిన్ రకాలతో పాటు, నాణ్యమైన టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి, ప్రపంచ ప్రమాణాలకు తగ్గ పసుపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ గంగారెడ్డి, సెక్రటరీ భవానీ, వ్యవసాయ సెక్రటరీ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశుపోషణతో రైతుల ఆదాయం రెట్టింపు

పశుపోషణతో రైతుల ఆదాయం రెట్టింపు

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

కేసీఆర్ ఆదేశాలతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్

కేసీఆర్ ఆదేశాలతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

జనగామ కలెక్టర్‌పై అట్రాసిటీ కేసు?

జనగామ కలెక్టర్‌పై అట్రాసిటీ కేసు?

తెలంగాణ సమావేశాల్లో కీలక బిల్లులు.. ప్రతిపక్షాల డిమాండ్లు ఇవే.

తెలంగాణ సమావేశాల్లో కీలక బిల్లులు.. ప్రతిపక్షాల డిమాండ్లు ఇవే.

కళ్లలో కారం చల్లి నిమిషాల్లో కోటి రూపాయల అపహరణ

కళ్లలో కారం చల్లి నిమిషాల్లో కోటి రూపాయల అపహరణ

భద్రాద్రి జిల్లాలో 9 పుష్కర ఘాట్లు.. రూ. 376 కోట్లతో మాస్టర్ ప్లాన్!

భద్రాద్రి జిల్లాలో 9 పుష్కర ఘాట్లు.. రూ. 376 కోట్లతో మాస్టర్ ప్లాన్!

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు

హైదరాబాద్‌లో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

హైదరాబాద్‌లో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

కుక్కకాటుతో బాలుడి మృతి

కుక్కకాటుతో బాలుడి మృతి

‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు – పొంగులేటి హెచ్చరిక

‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు – పొంగులేటి హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870