हिन्दी | Epaper

TG: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

Tejaswini Y
TG: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

TG : సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు. సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల మారు పేరుకు సంబంధించి త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు. అలాగే మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి వాళ్లకున్న వ్యాధులకు సంబంధించి అన్ని విధాల పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

Read Also: Phone Tapping Case : సంతోష్ రావు సిట్ విచారణ పూర్తి

TG: Good news for Singareni workers.. Bhatti Vikramarka's key announcement!
TG: Good news for Singareni workers.. Bhatti Vikramarka’s key announcement!

కార్మికుల కోసం కొత్త కమిటీ

కోల్ ఇండియ నిబంధనల మేరకు సింగరేణి అధికారులకు కల్పిస్తున్న సౌకర్యాలను కార్మికులకు కూడా వర్తింప చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీ నిర్ణయించి, వారి కల సాకారం చేస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సింగరేణి ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనాగా గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

తమ ప్రభుత్వం సింగరేణిలో 2,539 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. వీటిలో 798 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా, 1,741 కారుణ్య నియామకాలు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు, క్యాథ్ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇక 2024-25లో సింగరేణి చరిత్రలో అత్యధికంగా రూ.6,394 కోట్లు సాధించగా, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద రూ.802 కోట్లను కార్మికులకు చెల్లించామన్నారు. వీరితో పాటు, పొరుగు సేవల సిబ్బందికి కూడా రూ.5,500 చొప్పున లాభాల్లో వాటా చెల్లించినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870