తెలంగాణ (TG) రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోసం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం (రేపు) 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Read Also: Phone Tapping Case : మంత్రి పొంగులేటి వార్నింగ్
ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది
మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులను ఎస్ఈసీ వెబ్సైట్ లేదా TE-POLL యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొత్తం 2,981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: