— జూలై 17 తుది గడువు.. ఆగస్టు మొదటి వారంలో పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పిజి ఎంట్రన్స్ టెస్ట్(TG CPGET)-2025 దరఖాస్తు లను ఈ నెల 18 నుంచి స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు.

నోటిఫికేషన్ విడుదల
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉస్మానియా యూని వర్సిటీ ఉప కులపతి(విసి) ప్రొఫెసర్ ఎం కుమార్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ కార్య క్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ఛెర్మన్లు ప్రొఫె సర్ పురుషోత్తం, ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ తోపాటు శాతవాహన యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ యు ఉమేష్ కుమా ర్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూని వర్సిటీ ఇన్ఛార్జ్ విసి ప్రొఫెసర్ సూర్య ధనుం జయ్, సిపిజిఈటి-2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. పిజి కోర్సులైన ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడి, ఎంపిఈడి వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ప్రోగ్రామ్లతోపాటు 5 సంవత్స రాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లలో ప్రవే శానికి సీపీగెట్ పరీక్షను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
వివిధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు
రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యా లయం, కాకతీయ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వ విద్యాలయం, తెలంగాణ విశ్వ విద్యాలయం, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యా లయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జెఎన్టియుహెచ్) లో ప్రవేశాల కోసం సిపిజెట్ను నిర్వహించ నున్నారు.
18 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 17 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 500 అపరాధ రుసుంతో జులై 24 వరకు, రూ. 2000తో జులై 28 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 297 కాలేజీల్లో సుమారు 50వేల సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. మొత్తం 51 సబ్జెక్టులలో 108 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష ఫీజు జనరల్ వారికి రూ. 800 కాగా ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా నిర్ణయిం చారు. అదనపు సబ్జెక్టుకి రూ. 450 చెల్లించాల్సి ఉం టుంది. గత ఏడాది 46,742 సీట్లు అందు బాటులో ఉండగా.. వాటిలో 21,560 సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు. ఈ ఏడాది అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 4వేల సీట్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సుమారు 50వేల సీట్లలో ప్రవేశాలను చేపట్టను న్నారు. త్వరలోనే ఎర్సైన్స్ యూనివర్సిటీకి అనుమతి వస్తే అందులో కూడా అడ్మిషన్లను చేపట్టనున్నట్టు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ తెలిపారు.
Read also: Rajiv Yuva Vikasam: హోల్డ్ లో యువ వికాసం దరఖాస్తులు
Gaddar Foundation: గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు