हिन्दी | Epaper

TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

Saritha
TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

హైదరాబాద్ : ఓవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేజీ మహేశ్వర్ రెడ్డి మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఎస్ఐఆర్ విషయంలో ఇరు నేతల మధ్య వాగ్వాదంతో సభలో రాజకీయ వేడి రాజేసింది. (TG) మున్సిపాలిటీ సవరణ బిల్లు సందర్భంగా శాసనసభలో అక్బరు ద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బీహార్, బెంగాల్ లో మైనార్టీ ఓట్లు 50లక్షలు తొలగించారని మండి పడ్డారు. ఎస్ఐఆర్ బిహార్, యుపినే కాదు దేశం మొత్తం తెస్తు హిందూ ముస్లిం అంటూ తారతమ్యం చేస్తున్నారన్నారు. ఈసందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

ఓవైసీ ఇష్టారాజ్యాంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు అవడం లేదన్నారు. ఇవాళ సభలో జరుగుతున్న చర్చ ఏమిటి? అక్బరుద్దీన్ మాట్లాడుతున్నదే మిటన్నారు. (TG) ఎస్ఐఆర్ కావాలనుకుంటే ప్రత్యేక చర్చ పెట్టాలని అంతే తప్ప జరుగుతున్న చర్చను పక్కదారిపట్టించేలా చూడవద్దన్నారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుందని అర్హులైన వారికి ఓటుహక్కు ఇవ్వాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారన్నారని ..ఓవైసి ఓట్ జోరి జరుగుతుందని చెప్పడం తప్పాఅని బిజెపి నేతలను ప్రశ్నించారు.

Read also: Ponguleti Srinivas: సమగ్ర సమాచారంతో భూభారతి కొత్త యాప్

TG

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870