हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Temperatures : రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

sumalatha chinthakayala
Temperatures : రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

Temperatures : రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. ఎండ వేడిమి కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. నిన్న నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయ. అత్యధికంగా నిజామాబాద్‌లోని సీహెచ్‌ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

 రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని సూచన

మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో దాదాపు 8 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ అధికారులు సూచించారు.

బేగంబజార్​లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్​ సిటీలోనూ ఎండ పెరుగుతున్నది. బోయిన్​పల్లిలో 42.1, బేగంబజార్​లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 26 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, వనపర్తిలో 25 డిగ్రీల మేర రికార్డయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 21 డిగ్రీలకన్నా ఎక్కువగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Read Also: HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870